Minister Uttam Kumar Review On Medigadda Works : మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్ట మరమ్మతులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించనున్నారు. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకునేందుకు శుక్రవారం రోజున (జూన్ 6వ తేదీ) క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఇంజినీర్లతో కలిసి పనులపై ఆరా తీయనున్నారు.
మూడు ఆనకట్టల నిర్మాణ సంస్థలైన ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కావాలని మంత్రి కార్యాలయం ఆదేశాలు చేసింది.. మేడిగడ్డ ఆనకట్టతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న తాత్కాలిక మరమ్మతులు, వర్షాకాలం కోసం రక్షణ చర్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంజfనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్షిస్తారు.