Minister Sandhya Rani Condoled with Teachers Families: అల్లూరి జిల్లాలో ఇటీవల వాగులో కొట్టుకుపోయి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి కుటుంబాలకు మృతదేహాలు అప్పగించామన్నారు. కేంద్రం నుంచి 10 లక్షలు, రాష్ట్రం ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. మృతుల కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సాయమడిగినా చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అనకాపల్లి కలుషితాహారం ఘటనలో ముగ్గురు చనిపోవడంతో అనధికార హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు పరిహారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 9:04 PM IST
Minister Sandhya Rani Condoled with Teachers Families: అల్లూరి జిల్లాలో ఇటీవల వాగులో కొట్టుకుపోయి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి కుటుంబాలకు మృతదేహాలు అప్పగించామన్నారు. కేంద్రం నుంచి 10 లక్షలు, రాష్ట్రం ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. మృతుల కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సాయమడిగినా చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అనకాపల్లి కలుషితాహారం ఘటనలో ముగ్గురు చనిపోవడంతో అనధికార హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.