Government Announced Compensation for Electric Shock Victims Family in Kadapa : కడపలో విద్యుత్ ప్రమాదానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బుధవారం అగాడి వీధిలో సైకిల్పై వెళ్తుండగా విద్యుత్ తీగ తగిలి తన్వీర్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆదాం అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో చనిపోయిన తన్వీర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన ఆదాం కుటుంబానికి 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి చిన్నారుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేయనున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
విద్యుత్ ప్రమాదానికి గురైన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 3:28 PM IST
Government Announced Compensation for Electric Shock Victims Family in Kadapa : కడపలో విద్యుత్ ప్రమాదానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బుధవారం అగాడి వీధిలో సైకిల్పై వెళ్తుండగా విద్యుత్ తీగ తగిలి తన్వీర్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆదాం అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో చనిపోయిన తన్వీర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన ఆదాం కుటుంబానికి 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి చిన్నారుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేయనున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.