ETV Bharat / snippets

విద్యుత్‌ ప్రమాదానికి గురైన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 3:28 PM IST

government_announgovernment_announced_compensation_for_electric_shock_victimsd_compensation_for_electric_shock_victims
government_announced_compensation_for_electric_shock_victims (ETV Bharat)

Government Announced Compensation for Electric Shock Victims Family in Kadapa : కడపలో విద్యుత్‌ ప్రమాదానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బుధవారం అగాడి వీధిలో సైకిల్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగ తగిలి తన్వీర్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆదాం అనే బాలుడు తీవ్రంగా గాయప‌డ్డాడు. ప్రమాదంలో చనిపోయిన తన్వీర్‌ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన ఆదాం కుటుంబానికి 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి చిన్నారుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేయనున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌ తీగల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

Government Announced Compensation for Electric Shock Victims Family in Kadapa : కడపలో విద్యుత్‌ ప్రమాదానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బుధవారం అగాడి వీధిలో సైకిల్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగ తగిలి తన్వీర్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆదాం అనే బాలుడు తీవ్రంగా గాయప‌డ్డాడు. ప్రమాదంలో చనిపోయిన తన్వీర్‌ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన ఆదాం కుటుంబానికి 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి చిన్నారుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేయనున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌ తీగల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.