ETV Bharat / snippets

చంద్రబాబుతో నాదిర్‌ గోద్రెజ్ భేటీ - రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 8:59 AM IST

Nadir Godrej Met CM Chandrababu
Nadir Godrej Met CM Chandrababu (ETV Bharat)

Nadir Godrej Met Chandrababu : గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌-ఆయిల్‌ పామ్‌ రాష్ట్రంలో అమలుపై కీలక చర్చలు జరిగినట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. అదేవిధంగా అమరావతి, విశాఖలో పురుగుమందు తయారీ, రొయ్యల మేత, ఆయిల్ పామ్ సాగు తదితర అంశాలకు సంబంధించి రూ.2800 కోట్ల పెట్టుబడులపై కీలక చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఏపీలో వ్యవసాయ, ఆక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పెంచే దిశగా గోద్రెజ్ ప్రతినిధులతో సానుకూల చర్చలు జరిగాయని సీఎం వెల్లడించారు.

Nadir Godrej Met Chandrababu : గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌-ఆయిల్‌ పామ్‌ రాష్ట్రంలో అమలుపై కీలక చర్చలు జరిగినట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. అదేవిధంగా అమరావతి, విశాఖలో పురుగుమందు తయారీ, రొయ్యల మేత, ఆయిల్ పామ్ సాగు తదితర అంశాలకు సంబంధించి రూ.2800 కోట్ల పెట్టుబడులపై కీలక చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఏపీలో వ్యవసాయ, ఆక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పెంచే దిశగా గోద్రెజ్ ప్రతినిధులతో సానుకూల చర్చలు జరిగాయని సీఎం వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.