Talasani Srinivas Yadav on Current Bills : అర్హులందరికీ ఉచిత విద్యుత్, ఉచిత నీటిని సరఫరా చేయాలని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలోని జవహర్ జనతా, భర్తన్ కాంపౌండ్లలో ఆయన పర్యటించారు. విద్యుత్ బిల్లులు, నల్లా బిల్లులు చెల్లించాలంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో జీరో విద్యుత్ బిల్లు, ఉచిత నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, బిల్లులు చెల్లించాలని పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అర్హులైన వారు బిల్లులు చెల్లించొద్దని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో బస్తీలలో పారిశుధ్య నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు.