Peerjadiguda Mayor Election Today : బీఆర్ఎస్ ఖాతాలో నుంచి పీర్జాధిగూడ మేయర్ పీఠం కాంగ్రెస్లోకి వెళ్లనుంది. మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడ నగర పాలక సంస్థ కొత్త మేయర్ ఎన్నిక శుక్రవారం (ఈరోజు) మధ్యాహ్నం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నెగ్గగా, కాంగ్రెస్ కార్పొరేటర్లు కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. 26 మంది కార్పొరేటర్లు ఉన్న పాలక వర్గంలో 21 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఐదుగురు కార్పొరేటర్లు మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నారు. మేయర్గా అమర్సింగ్ను ఎన్నుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
మేయర్ జక్కా వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మేయర్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేటర్లు అధికార పక్షం వేపే మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా భావించిన హస్తం పార్టీ, క్షేత్ర స్థాయి నుంచి హైదరాబాద్లో పాగా వేయాలని చూస్తోంది.