ETV Bharat / snippets

ఈనెల 31న కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన- స్వయంగా పింఛన్లు అందించనున్న చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 3:21 PM IST

CM Tour In Kurnool
CM Tour In Kurnool (ETV Bharat)

CM Tour In Kurnool : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈనెల 31న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవ్య, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

అయితే, ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబరు నెల పింఛన్లను ఈ నెల 31నే లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. 1న ఆదివారం సెలవుదినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31న అందుకోలేకపోయిన లబ్దిదారులకు 2న అందించాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. వీలై నంతవరకు 31నే 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

CM Tour In Kurnool : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈనెల 31న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవ్య, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

అయితే, ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబరు నెల పింఛన్లను ఈ నెల 31నే లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. 1న ఆదివారం సెలవుదినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31న అందుకోలేకపోయిన లబ్దిదారులకు 2న అందించాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. వీలై నంతవరకు 31నే 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.