Bharat Biotech Donation to AP: ఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ సంస్థ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమ చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ప్రకటించారు. ఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వరద బాధితులకు చేయూత - ఏపీ సీఎం సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.కోటి విరాళం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2024, 8:01 PM IST
Bharat Biotech Donation to AP: ఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ సంస్థ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమ చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ప్రకటించారు. ఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.