ETV Bharat / snippets

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 9:10 AM IST

APPSC Postpone Group 1 Mains Exam
APPSC Postpone Group 1 Mains Exam (ETV Bharat)

APPSC Postpone Group 1 Mains Exam : ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 2 నుంచి 9 వరకు (7వ తేదీ మినహా) జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) వెల్లడించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఏపీలో మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 4,496మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

APPSC Postpone Group 1 Mains Exam : ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 2 నుంచి 9 వరకు (7వ తేదీ మినహా) జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) వెల్లడించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఏపీలో మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 4,496మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.