ETV Bharat / snippets

ఏపీలో మరో 'ఫార్మా కంపెనీలో' ప్రమాదం - నలుగురు కార్మికులు!

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 10:20 AM IST

Updated : Aug 23, 2024, 10:25 AM IST

Parawada Pharma City Incident In AP
Parawada Pharma City Incident In AP (ETV Bharat)

Parawada Pharma City Incident In AP : ఏపీ అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు వైద్యం అందేలా చూడాలన్నారు.

Parawada Pharma City Incident In AP : ఏపీ అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు వైద్యం అందేలా చూడాలన్నారు.

Last Updated : Aug 23, 2024, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.