Parawada Pharma City Incident In AP : ఏపీ అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్కు చెందినవారిగా గుర్తించారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు వైద్యం అందేలా చూడాలన్నారు.