ETV Bharat / snippets

చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్ - రెజ్లింగ్​లో భారత్​కు పతకం ఖాయం

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 10:48 PM IST

Vinesh Phogat
Vinesh Phogat (Getty Images)

Vinesh Phogat Paris Olympics: పారిస్ ఒలింపిక్స్​ మహిళల రెజ్లింగ్​లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ ఫైనల్స్​కు దూసుకెళ్లింది. మంగళవారం గూజ్​మన్ (క్యూబా)తో సెమీఫైనల్​లో తలపడ్డ వినేశ్ 5-0 తేడాతో నెగ్గింది. దీంతో భారత్​కు మరో పతకం ఖాయమైంది. కాగా ఒలింపిక్స్​లో రెజ్లింగ్​లో ఫైనల్​ చేరుకున్న తొలి భారత మహిళా రెజ్లర్​గా వినేశ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్​లో వినేశ్ గెలిస్తే భారత్ ఖాతాలో పసిడి చేరుతుంది.

కాగా, ఈ విశ్వక్రీడల్లో సోమవారమే వినేశ్ ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్​లో ఆడింది. వరుస మ్యాచ్​ల్లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వినేశ్ ప్రీ క్వార్టర్స్​లో వరల్డ్ నెం.1 సుసాకీ (జపాన్)ను 3-2తో, క్వార్టర్స్​లో లివచ్‌ ఒక్సానా (ఉక్రెయిన్‌)పై 7-5 తేడాతో నెగ్గింది.

Vinesh Phogat Paris Olympics: పారిస్ ఒలింపిక్స్​ మహిళల రెజ్లింగ్​లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ ఫైనల్స్​కు దూసుకెళ్లింది. మంగళవారం గూజ్​మన్ (క్యూబా)తో సెమీఫైనల్​లో తలపడ్డ వినేశ్ 5-0 తేడాతో నెగ్గింది. దీంతో భారత్​కు మరో పతకం ఖాయమైంది. కాగా ఒలింపిక్స్​లో రెజ్లింగ్​లో ఫైనల్​ చేరుకున్న తొలి భారత మహిళా రెజ్లర్​గా వినేశ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్​లో వినేశ్ గెలిస్తే భారత్ ఖాతాలో పసిడి చేరుతుంది.

కాగా, ఈ విశ్వక్రీడల్లో సోమవారమే వినేశ్ ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్​లో ఆడింది. వరుస మ్యాచ్​ల్లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వినేశ్ ప్రీ క్వార్టర్స్​లో వరల్డ్ నెం.1 సుసాకీ (జపాన్)ను 3-2తో, క్వార్టర్స్​లో లివచ్‌ ఒక్సానా (ఉక్రెయిన్‌)పై 7-5 తేడాతో నెగ్గింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.