Team India Prize Money Split: టీ20 వరల్డ్కప్ నెగ్గిన టీమ్ఇండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కు అందజేసింది. దీంతో అప్పట్నుంచి ఎంతమంది, ఎంతెంత అందుకోనున్నారోనని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. అయితే దీనిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. వరల్డ్కప్లో పాల్గొనేందుకు ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్, రిజర్వ్ రిజర్వ్డ్ ప్లేయర్లు, ఇతర సిబ్బంది మొత్తం 42మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. ఎవరెవరికి ఎంత అందనుందంటే?
- జట్టులోని 15మంది ప్లేయర్లు, హెడ్ కోచ్ ద్రవిడ్ ఒక్కొక్కరు రూ.5కోట్ల చొప్పున అందుకోనున్నారు. టోర్నీలో మ్యాచ్ ఆడనివాళ్లకూ అంతే దక్కుతుంది.
- బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు అందనున్నాయి.
- సపోర్టింగ్ స్టాఫ్ అంటే, ఫిజియోథెరపిస్ట్లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లకు తలో రూ.2కోట్లు దక్కనున్నాయి.
- చీఫ్ సెలక్టర్ అండ్ కమిటీ, నలుగురు రిజర్వ్ ప్లేయర్లు ఒక్కొక్కరు రూ.1కోటి చొప్పున అందుకోనున్నారు.