Paris Paralympics India: పారిస్ పారాలింక్స్లో భారత్కు 21వ పతకం వచ్చింది. పురుషుల షాట్ పుట్ (F46) విభాగంలో సచిన్ సర్జేరావ్ రజతం దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన గోల్డ్ పోరులో సచిన్ 16.32మీటర్ల త్రో విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా, గత 30ఏళ్లలో పురుషుల షాట్ పుట్ విభాగంలో ఇది భారత్కు తొలి పారాలింపిక్ పతకం కావడం విశేషం. తాజా మెడల్తో భారత్ పతకాల సంఖ్య 21కి చేరింది.
ఇక ఇదే ఈవెంట్లో కెనడా పారా అథ్లెట్ జి స్టీవార్ట్ స్వర్ణం దక్కించుకున్నాడు. 16.38 మీటర్ల త్రో విసిరిన స్టీవార్ట్ తొలి స్థానంలో నిలిచాడు.
భారత్ పతకాలు
స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం |
3 | 8 | 10 | 21 |