PCB Selectors:2024 టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్ ఓటమి కారణంగా ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ వాహబ్ రియాజ్ను ఆ పదవిలో నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. రియాజ్తోపాటు అబ్దుల్ రజక్పై వేటు పడింది. సెలక్షన్ కమిటీ నుంచి రజక్ను కూడా ఆ బాధ్యతల్లో నుంచి తప్పించే ఛాన్స్ ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, పొట్టి ప్రపంచకప్నకు ఎంపికైన జట్టుపట్ల సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
కనీస అవగాహన లేకుండా టీమ్ను ఎంపిక చేశారని పలువురు సీనియర్లు ఫైరయ్యారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, ప్లేయర్ల ఎంపిక, అనాలోచిత నిర్ణయాల నేపథ్యంలో రియాజ్పై విమర్శలు వచ్చాయి. కాగా, టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్ కనీసం సూపర్ 8కు కూడా అర్హత సాధించకుండా లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇక గడిచిన నాలుగేళ్లలో పీసీబీ ఆరుగురు చీఫ్ సెలక్టర్లను మార్చడం గమనార్హం.