India Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్లు అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ (SU5) ఈవెంట్లో తులసీమతి మురుగేశన్ రజతంతో సత్తా చాటింది. కాగా, మురుగేశన్కు ఇదే తొలి పారాలింపిక్స్ పతకం కావడం విశేషం. ఇక ఇదే పోటీలో చైనా ప్లేయర్ యాంగ్ స్వర్ణం దక్కించుకుంది.
మరోవైపు ఇదే ఈవెంట్ ఫైనల్ కంటే కాస్త ముందు మనీషా రామ్దాస్ కాంస్యం ముద్దాడింది. కాంస్య పోరులో మనీషా 21-12, 21-8 వరుస సెట్లలో ఆధిక్యం ప్రదర్శించి పతకం దక్కించుకుంది. ఈ క్రమంలో పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో పతకం సాధించిన తొలి మహిళా పారా అథ్లెట్గా మనీషా రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్లో భారత్ పకతాల సంఖ్య 11కు చేరింది.