Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్లే ఛాన్స్ లేదని బీసీసీఐ వర్గాలు తాజాగా వెల్లడించాయి. టోర్నీలో మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టును భద్రతా కారణాల దృష్యా ఆతిథ్య దేశం పాకిస్థాన్కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదట. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మ్యాచ్ల కోసం హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని ఐసీసీని బీసీసీఐ కోరనుందట. ఈ మేరకు దుబాయ్, శ్రీలంక దేశాల్లో టీమ్ఇండియా మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనున్నట్లు బోర్డు మెంబర్ ఒకరు చెప్పారు.
కాగా, వచ్చే వారం కొలంబోలో జరగనున్న ఐసీసీ మీటింగ్లో బీసీసీఐ ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలిసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకుంది. దీంతో టోర్నమెంట్ పాకిస్థాన్లో జరగనుంది. అయితే ఇరుదేశాల మధ్య వివాదాల కారణంగా టీమ్ఇండియా కొన్నేళ్లుగా పాక్కు వెళ్లడం లేదు. గతేడాది ఆసియా కప్కు కూడా పాక్ ఆతిథ్యమివ్వగా, భారత్ మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించారు.