Anshuman BCCI: బ్లడ్ క్యాన్సర్తో హాస్పిటల్లో పోరాడుతున్న మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం బీసీసీఐ రూ.1కోటి ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని తక్షణమే అన్షుమాన్ కుటుంబ సభ్యులకు అందించాలని బోర్డు అధికారులకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదేశించారు. 'మాజీ ప్లేయర్ అన్షుమాన్కు బోర్డు నుంచి తక్షణమే రూ.1 కోటి ఆర్థిక సహాయం కింద విడుదల చేయాలని సెక్రటరీ జై షా అధికారును ఆదేశించారు' అని బీసీసీఐ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక జైషా ఇప్పటికే అన్షుమాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారట. ఈ నేపథ్యంలో వారికి బీసీసీఐ అండగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న అన్షుమాన్ గతేడాది నుంచి లండన్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 71ఏళ్ల అన్షుమాన్ 1975-87 మధ్య కాలంలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.