Shubman Gill 2024: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు బీసీసీఐ మంచి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జట్టుకు గిల్ను కెప్టెన్గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత టీ20 వరల్డ్కప్ తర్వాత టీమ్ఇండియ జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో 5మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్, విరాట్, పాండ్య, బుమ్రా తదితరులకు విశ్రాంతినిచ్చి యంగ్ ప్లేయర్లను పంపాలని బీసీసీఐ భావిస్తోంది.
ఈ క్రమంలో యంగ్ టీమ్ సారథ్య బాధ్యతలను గిల్కు అప్పగించాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తుందట. అందుకే వరల్డ్కప్ స్టాండ్బై గా అమెరికాలో ఉన్న గిల్ను స్వదేశం రప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పర్యటనకు వెళ్లనున్న జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ జట్టులో దాదాపు కుర్రాళ్లకే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కాగా, జూలై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది.