PM Modi holds talks with Abu Dhabi Crown Prince : అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, యూఏఈకి చెందిన సంస్థల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి.
అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య ఎల్ఎన్జీ సరఫరా కోసం ఒప్పందం కుదిరింది. ఏడీఎన్ఓసీ, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ISPRL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ (ENEC), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణకు ఆమోదం లభించింది. భారత్లో ఫుడ్ పార్కుల ఏర్పాటుపై గుజరాత్ ప్రభుత్వం, అబుదాబి డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీ MOU చేసుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.