వైఎస్సార్సీపీకి షాక్ - ఎన్నికల సమయంలో టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు - YSRCP Leaders Joins In TDP Party
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 27, 2024, 10:35 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-03-2024/640-480-21085590-thumbnail-16x9-ycp-to-tdp2.jpg)
YSRCP Leaders Joins TDP Party in Sarvepalli Constituency : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. సోమిరెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటామని కొత్తగా వచ్చి చేరుతున్న వారు చెబుతున్నారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబుతోనే సాధ్యమనే నిర్ణయానికి వచ్చి టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన 32 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరారు. అలాగే వెంకటాచలం మండలం కనుపూరుకు గ్రామానికి చెందిన వైసీపీ నేత ఆదూరు బద్రీనాథ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలు టీడీపీలో చేరారు.
అదేవిధంగా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంకు చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు, మాజీ సర్పంచ్, బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు బొనిగి ఆనందయ్య టీడీపీలోకి రావడంతో ఆ పార్టీకి మరింత బలంచేకూరింది. కరోనాకు ఆయుర్వేద మందు తయారుచేసి దేశస్థాయిలో గుర్తింపు పొందిన ఆనందయ్య తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని స్పష్టం చేశారు.