thumbnail

ఇళ్ల పట్టాలు సరే స్థలాలు ఎక్కడ ? - కాకినాడ కలెక్టరేట్​ దగ్గర మహిళల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 3:01 PM IST

Women Protest for Housing Plots: కాకినాడ కలెక్టరేట్ వద్ద 80 కుటుంబాలకు చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, కానీ స్థలాలు మాత్రం కేటాయించలేదని మండిపడుతున్నారు. సామర్లకోట మండలం కాపవరంలో ఉన్న కుటుంబాలకు జగనన్న ఇళ్ల స్థలాలు ఇప్పటికీ కేటాయించలేదని మహిళలు నిరసనకు దిగారు. పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నాయకుడు దౌలూరి దొరబాబు తమకు ఇళ్లపట్టాల పంపీణీ సమయంలో బ్రహ్మానందపురం గోదావరి కాలువ వద్ద స్థలం చూపించారని తెలిపారు. 

నదీ తీరం వద్ద స్థలాలు కేటాయిస్తే తమ బతుకులు ఏం కావాలని అప్పుడే ప్రశ్నిస్తే, మరో చోట ఇస్తానని దొరబాబు మాట ఇచ్చారని అన్నారు. నాలుగున్నర ఏళ్లైనా స్థలాలు మాత్రం చూపించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దౌలూరి దొరబాబు తమను మోసం చేశారంటూ మండిపడ్డారు. అధికారులు స్పందించి తమ స్థలాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, తర్వాత ప్రభుత్వం ఉండకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.