దర్జాగా తవ్వకాలు - అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరింపు - వైసీపీ నేతల అక్రమ గ్రావెల్ తవ్వకాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 5:54 PM IST

Villagers Stopped YSRCP Leaders Illegal Mining: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామో, రామోనని ఇప్పుడే సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. అడ్డుకున్న స్థానికులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రోసనూరు వద్ద సిరిశనగండ్లలో అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న వైసీపీ నేతలను గ్రామస్థులు అడ్డకున్నారు.

Illegal Gravel Mining in Tirupati: రోసనూరు సమీపంలో 200 ఎకరాలలో కొందరు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన నేతలు అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. సిరిశనగండ్ల గ్రామస్థులతో కలిసి తవ్వకాలను అడ్డకునేందుకు యత్నించిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి సుబ్రహ్మణ్యంపై డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ ఫోన్‍ ద్వారా బెదిరింపులకు దిగారు. గ్రావెల్‌ తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్థులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతూ కేసులు పెట్టమంటారా అని సీఐ జగన్‌ మోహన్‌రావు గ్రామస్థులను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.