thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 4:47 PM IST

ETV Bharat / Videos

వైఎస్సార్సీపీ మునిగిపోయే పడవ లాంటిది: తులసిరెడ్డి

Tulasi Reddy Comments on YSRCP Goverment in YSR District : వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కడప జిల్లా వేంపల్లిలో పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్​కు పట్టిన పరిస్థితే సీఎం జగన్​కు వస్తుందని జోస్యం చెప్పారు. సీఎం జగన్​పై అన్ని వర్గాలలో అసంతృప్తి తారాస్థాయిలో ఉందని పేర్కొన్నారు. అన్ని సర్వేలు వైసీపీ ఓటమి తధ్యం అంటున్నాయని తెలిపారు.

సీఎం జగన్​ ఒకసారి ముఖ్యమంత్రి అయితేనే సచివాలయాన్ని తాకట్టు పెట్టారు, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని హోల్​ సేల్​గా అమ్ముతారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​కు పూర్వ వైభవం ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు. గతంలో కర్ణాటక, తెలంగాణలో అధికారం కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఏపీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్​ పార్టీని ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.