thumbnail

నర్సీపట్నం అభివృద్ధిలో అయ్యన్నది చెరగని ముద్ర: తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి - AYYANNA PATRUDU MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 9:41 AM IST

Speaker Ayyanna Patrudu in Narsipatnam : ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అభినందన సభ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యంత కోలాహలంగా జరిగింది. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికైన అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవి దక్కిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఆత్మీయులంతా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యన్నకు అభినందన సభ నర్సీపట్నంలో అత్యంత కోలాహలంగా నిర్వహించారు.

ఈ అభినందన సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన వక్త, వ్యాఖ్యాత నర్సిరెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయ్యన్న పాత్రుడుతో సహా నాయకులందరినీ అలరించాయి. ట్రాన్స్ఫార్మర్​నైనా టచ్ చేయొచ్చు గాని అయ్యన్నపాత్రుడు టచ్ చేస్తే ఎలా ఉంటుందో జగన్ మోహన్ రెడ్డికి చూపించే విధంగా ఫలితాలు వెల్లడయ్యాయని నర్సిరెడ్డి పేర్కొన్నారు. తమ నాయకుడు అయ్యన్న పాత్రుడు పనితీరు, వైఖరిని ఉద్దేశించి నర్సిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. నర్సీపట్నం నియోజవర్గ అభివృద్ధిలో అయ్యన్న చెరగని ముద్ర వేశారని నర్సిరెడ్డి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.