నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం మరోసారి టెట్ నిర్వహించాలి- మంత్రి నారా లోకేశ్​కు టీడీపీ ఎమ్మెల్సీల వినతి - TDP mlcs Meet with Minister Lokesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 9:06 PM IST

thumbnail
టెట్‌ మళ్లీ నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్​కు టీడీపీ ఎమ్మెల్సీల వినతి (ETV Bharat)

TDP MLCs Meet Minister Lokesh About TET Exam : రాష్ట్రంలో అత్యధిక పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేసినందున నిరుద్యోగ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించే విధంగా మరోసారి టెట్ నిర్వహించాలని తెలుగుదేశం ఎమ్మెల్సీలు కోరారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్​ను, శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు కలిసి వినతి పత్రం అందిచారు. తమ విన్నపం పట్ల లోకేశ్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని రకాల పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఉపాధ్యాయుడు కావాలన్న తమ కల నెరవేరే రోజు ఇచ్చినందుకు థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారంటూ కొనియాడారు. ఇప్పుడు మరికొంత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా మరోసారి టెట్ నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రిని కోరటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.