ఎన్నికల సంఘానికి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి లేఖ - TDP MLC Bhumireddy Letter to EC - TDP MLC BHUMIREDDY LETTER TO EC
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 2:06 PM IST
TDP MLC Bhumireddy Letter to Election Commission: ఎన్నికల సంఘానికి తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లేఖ రాశారు. 60 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఒత్తిడిని వారు తట్టుకోలేరని లేఖలో పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారు, గర్భిణీ ఉద్యోగులు, చిన్నపిల్లలు ఉన్న వారు, కొవిడ్ బారిన పడి ఇబ్బంది పడిన వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని ఈసీని కోరారు.
MLC Bhumireddy Letter to EC on DSC: కాగా ఇటీవలే రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఎంపిక కోసం జరిగే డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల(AP Elections 2024) ప్రక్రియ ప్రారంభమవడంతో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావడానికి అసౌకర్యం కలుగుతుందని లేఖలో పేర్కొన్నారు. వేలాది మంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా డీఎస్సీ పరీక్ష రాస్తున్నారని తెలిపిన ఆయన డీఎస్సీని వాయిదా వేయాలని కోరారు.