జగన్కు సీఎంగా కొనసాగే అర్హత లేదు- ప్రజలు మార్పును కోరుతున్నారు: రవీంద్రకుమార్ - Kanakamedala on YCP Govt - KANAKAMEDALA ON YCP GOVT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 5:30 PM IST
TDP Leader Kanakamedala Comments on YCP Government: రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. మళ్లీ ఇలాంటి విధ్వంసక పాలన సాగించే ముఖ్యమంత్రి రాకుండా ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
వైసీపీ నేతలు ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉంచాలని కోరడంపై కనకమేడల అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. జగన్లాంటి వాళ్లు మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన పేర్కొన్నారు. దీని కోసం గొడ్డలి ఉపయోగించకుండా కేవలం ఓటు అనే ఆయుధంతో విధ్వంసక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కనకమేడల పిలుపునిచ్చారు. ప్రజలంతా కూటమి గెలుపు కోసమే ఎదురుచూస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేసినా నిర్భయంగా ప్రజలు ఓటు వేసేందుకు ముందుకురావాలని కనకమేడల సూచించారు.