మేదరమెట్ల సభలోనూ జగన్ అబద్ధాలు- హామీలు నిలబెట్టుకున్నానని కహానీలు: అచ్చెన్న - TDP Atchannaidu Fire on CM Jagan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 10:05 PM IST

TDP Leader Atchannaidu Fire on CM Jagan : బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభలోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అబద్దాల విషపు జల్లు కురుపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. హామీలు నిలబెట్టుకున్నానన్న జగన్ మాట పచ్చి అబద్ధమని దుయ్యబట్టారు. 85శాతం హామీలు అమలు చేయకుండా మాట తప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమానికి బడ్జెట్​లో జగన్ 15 శాతం ఖర్చు చేయగా, నారా చంద్రబాబు నాయుడు 19 శాతం ఖర్చు చేశారని గుర్తు చేశారు. 

CM Jagan Comments in Siddham Meeting : జగన్ కల 10 లక్షల కోట్ల దోపిడీ, జిల్లాకొక సొంత ప్యాలెస్ నిర్మాణమని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. ప్రజా విశ్వాసం కోల్పోయినందునే సభకు నిండా లక్ష మంది కూడా రాలేదని అన్నారు. తన మోసాల్ని టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పడం జగన్ నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్, మాట తప్పి మడమ తిప్పాడని మండిపడ్డారు. ఓటు అడిగే హక్కు జగన్ కోల్పోయాడని దుయ్యబట్టారు. బాబాయి గొడ్డలివేటు పాపంతో పులివెందులలో ఎలా గెలుస్తావో చూసుకో అని అచ్చెన్న ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.