ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలంటే వైఎస్సార్సీపీని ఓడించాలి: దేవినేని - Devineni Comments on Land Titling

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 5:31 PM IST

thumbnail

TDP Devineni Comments on Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం భూభక్ష పథకం అని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రైతులను బెదిరించి భూములు లాక్కునేందుకే చీకటి చట్టాలను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తి హక్కును  హరించే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ను ప్రజలందరూ వ్యతిరేకించాలని సూచించారు. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలంటే కచ్చితంగా వైఎస్సార్సీపీని ఓడించి తీరాలని పిలుపునిచ్చారు. 

దుర్మార్గం, పౌరుల హక్కును పూర్తిగా హరించే హక్కు ఇది. రెవెన్యూ భూ యజమాని పేరు మార్చాలన్నా వారికి నోటీసు ఇచ్చే వెసులుబాటు కూడా లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో కొన్ని నెలలుగా న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు కదం తొక్కుతున్నారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టం వల్ల ప్రజల భూములు, ఆస్తులను వారి చేతుల్లో నుంచి లాగేసుకుంటారనీ, కబ్జాకోరులు చెలరేగిపోతారనే భయాలు పెరుగుతున్నాయి, భూవివాదాలను పూర్తిగా సివిల్ కోర్టుల పరిధి నుంచి తప్పించేసి, అధికారుల చేతుల్లో పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.