thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 1:36 PM IST

ETV Bharat / Videos

రానున్న ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం: పురందేశ్వరి - Purandeswari Campaign Rajahmundry

NDA Leaders Election Campaign in Rajahmundry : రాజమహేంద్రవరం అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ బీజేపీ చీఫ్, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాడవాడకూ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గం సమస్యలను తొలగించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తానని పురందేశ్వరి హామీ ఇచ్చారు.

మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పురందేశ్వరి కోరారు. కూటమి విజయం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని ప్రజలకు సూచించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.