కాంగ్రెస్ మత రాజకీయాలు చేసినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇచ్చారు : ఎంపీ అర్వింద్ - MP Arvind about Congress

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 5:01 PM IST

thumbnail
కాంగ్రెస్ మత రాజకీయాలు చేసినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇచ్చారు : ఎంపీ అర్వింద్ (ETV Bharat)

MP Arvind about Parliament Elections Results : మోదీ మీద నమ్మకం ఉంచి తనపై విశ్వాసంతో గెలిపించిన జిల్లా ప్రజలకు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చిల్లర, మత రాజకీయాలు చేసిందని అయినా ప్రజలు తమ వైపే నిలిచారని చెప్పారు. పసుపు రైతుల కల నెరవేరిందని, పసుపు బోర్డు తేవడం ద్వారా గ్రామాలు, రైతులు తనకు మద్దతిచ్చారన్నారు.

తాను ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతానని, షుగరు ఫ్యాక్టరీ తెరిపించే యత్నం చేస్తానని ఎంపీ అర్వింద్​ చెప్పారు. బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికల్లో చిల్లర రాజకీయాలు చేశారని, లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపారం చేసే ఆయనకు షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని తెలియదా అని ప్రశ్నించారు. అధికారులను, ప్రజలను బెదిరించటం మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో డబ్బులు పంచినా ప్రజలు తిరస్కరించారన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.