LIVE: మాడుగులలో లోకేశ్​ శంఖారావం సభ - ప్రత్యక్షప్రసారం - Shankaravam Yatra at Madugula

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 11:20 AM IST

Updated : Feb 20, 2024, 12:10 PM IST

 Nara Lokesh Shankaravam Yatra at Madugula Live: వైఎస్సార్​సీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి అరాచకపాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శంఖారావం యాత్ర చేపట్టారు. నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో నారా లోకేశ్ శంఖారావం యాత్రలో జరగనున్నది. ఉదయం మాడుగుల శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగించనున్నారు. ప్రభుత్వం అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ లోకేశ్​ శంఖారావం యాత్రలో ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో ఈ యాత్ర నేడు మాడుగుల, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేటలో కొనసాగనుంది. ఉదయం మాడుగుల నియోజకవర్గంలో, మధ్యాహ్నం  నర్సీపట్నంలో, సాయంత్రం పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న శంఖారావం సభలో లోకేశ్​ పాల్గొననున్నారు. 

రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందన్న లోకేశ్, రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఖాయమని అన్నారు. జగన్‌ పాలనలో విశాఖలో రోజుకో కిడ్నాప్‌, విధ్వంసం, హత్య, భూకుంభకోణం జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో విశాఖను  ఉపాధికి రాజధానిగా మారిస్తే, జగన్‌ గంజాయికి దేశ రాజధానిగా మార్చేశారు. ఉత్తరం నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కె.కె.రాజు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ, గంజాయి విచ్చలవిడిగా అందేలా చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించి పలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వారికి బుద్ధి చెబుతాం అని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ శంఖారావం యాత్ర ప్రత్యక్ష ప్రసారం మీకోసం

Last Updated : Feb 20, 2024, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.