అక్రమ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ - Daggupati Prasad on YSRCP Office

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 6:38 PM IST

thumbnail
అక్రమంగా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటాం: దగ్గుపాటి ప్రసాద్ (ETV Bharat)

MLA Daggupati Prasad on YSRCP Office: అనంతపురంలో అక్రమంగా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని టీడీపీ నాయకులకు కలిసి ఆయన పరిశీలించారు. హెచ్ఎల్​సీ స్థలాన్ని కబ్జాచేసి అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మించారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 900 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాల్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. 

"వైఎస్సార్సీపీ నేతలు హెచ్ఎల్​సీ స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడ చెట్లు కూల్చి వేసి ప్రజల సొమ్ముతో అక్రమంగా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి నగరపాలక, అహుడా(అనంతపురం-హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అనుమతులు కూడా తీసుకోలేదు. గత రెండేళ్ల నుంచి ఈ భవనాన్ని నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మేల్కొని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగానే మేం ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పరిశీలించాం. అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం." -  దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.