thumbnail

రాజధాని నిర్మాణం కోసం సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించాం: మంత్రి నారాయణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Minister Narayana Interview on Amaravati: అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనుల టెండర్ల ప్రక్రియ డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆ తర్వాత వేగవంతంగా పనులు చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం 4 నెలలుగా సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భూ సమీకరణ సమయంలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తామన్నారు. అమరావతి నగరం టాప్ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతుందన్నారు.

గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే రాజధాని అభివృద్ధి కుంటుపడిందని ఆయన మండిపడ్డారు. ఐదేళ్లుగా అమరావతి రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు. 4 నెలలు చర్చించి ఇక్కడున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు కౌలు చెల్లించామని, గతంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. అమరావతిని గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించినందున దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను మంత్రి ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.