పైప్లైన్ సమస్యపై తక్షణ చర్యలు- మంత్రి భరోసా- రైతులకు ఊరట - pattiseema Pipeline Leakage
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 5:21 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-07-2024/640-480-21876135-thumbnail-16x9-minister-nimmala-response-on-pipeline-leakage-problems-at-pattiseema.jpg)
Minister Nimmala Ramanaidu Response on Pipeline Leakage Problems at Pattiseema : ఏలూరు జిల్లా పోలవరం మండలం చీకట్లడొంక వద్ద పట్టిసీమ పైప్లైన్ పగిలి భారీగా నీరు ఎగిసి పడుతున్నాయి. ఇటుకలకోట డెలివరీ ఛానల్కు వెళ్లే పైపు లైన్ల ఎయిర్వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తాయి. పైపుల్లో నీరు ఫౌంటెన్లలా ఎగజిమ్మాయి. పైప్లైన్ లీకేజ్ సమస్యను త్వరగా అరికట్టాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి మంత్రి నిమ్మల రామానాయుడు తక్షణ పరిష్కార చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చెయ్యాలని వారిని కోరారు. దీంతో అధికారులు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. గోదావరి జలాలతో పంటలు మునిగిపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప్రజలు అన్నారు. తమ సమస్యకు ఇంత త్వరగా స్పందించి సాయం అందించిన మంత్రికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.