thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 7:54 PM IST

ETV Bharat / Videos

జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ: మంత్రి లోకేశ్ - Lokesh fire on Jagan due to evm

Minister Lokesh Fire on Jagan due to EVM Issue : జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే ఎలర్జీ అని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండమని చెప్పిన జగన్, ఇప్పుడు వాటి పనితీరును నిందిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారని లోకేశ్ ట్వీట్‌ చేశారు. ప్రజా హక్కులను పరిరక్షించే సంస్థలు, వ్యవస్థలను క్రమపద్ధతిలో నాశనం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టిన లోకేశ్ ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు.

ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వ్యవస్థలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. వంచించిన మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారని అంగీకరించలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ప్రజా ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను ఎప్పుడు తిరిగి ఇస్తున్నారని నిలదీశారు. 560 కోట్ల రూపాయలను రుషికొండలో ప్యాలెస్ కట్టుకోవడానికి ఎందుకు వెచ్చించారని రాష్ట్ర ప్రజలు దీనికి సమాధానం కోరుకుంటున్నారని చెప్పారు. ఈవీఎంలపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.