గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సమస్యలు: మంత్రి కొల్లు రవీంద్ర - Kollu Ravindra on Fires on YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 7:10 PM IST

thumbnail

Minister Kollu Ravindra on Fires on YSRCP: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి కష్టాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఐదేళ్లలో కాలువల్లో కనీసం మట్టి కూడా తీయలేకపోయారని ఆయన మండిపడ్డారు. కాలువల మరమ్మతులు చేయకుండా బిల్లులు చేసుకున్నారన్నారు. పట్టిసీమ పంపులను పక్కన పడేయాలని చూశారని విమర్శించారు. 

40 టీఎంసీల నీరు నిలబెట్టగలిగే పులిచింతలలో 0.8 టీఎంసీ లెవల్​కు పడేశారని మండిపడ్డారు. సాగర్, శ్రీశైలంలో నీళ్లు లేకుండా చేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పులిచింతలను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి 10వేల క్యూసెక్కుల సాగునీరు అవసరం ఉందని, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 5 వేల క్యూసెక్కుల నీళ్లే ఉన్నాయని అన్నారు. 10 వేల క్యూసెక్కుల నీళ్లు కావాలంటే, పై నుంచి నీళ్లు రావాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కేఆర్‌ఎంబీ నుంచి 10వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.