thumbnail

'మీరే మమ్మల్ని గట్టెక్కించాలి'- మంత్రిని కలిసిన లారీ యజమానుల సంఘం - LORRY OWNERS MEET MINISTER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 3:14 PM IST

LORRY OWNERS MEET TRANSPORT MINISTER: గత వైఎస్సార్సీపీ సర్కారు అమలుచేసిన లోపభూయిష్ట విధానాల ద్వారా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, గట్టెక్కించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర లారీ యజమానుల సంఘం కోరింది. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు నేతృత్వంలో బృందం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. రవాణా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి పరిష్కార మార్గం చూపాలని కోరారు. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన మంత్రి, త్వరలోనే రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటానని, హామీ ఇచ్చినట్లు లారీ యజమానులు తెలిపారు.

ఈ నెల 20వ తేదీన సైతం న్యూ ఆంధ్రా మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్​ను కలిశారు. పదేళ్లుగా పెండింగ్​లో ఉన్న కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మంత్రిని కలిసిన లారీ యజమానుల సంఘం ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని లేఖ అందించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.