మాజీ మంత్రి అమర్నాథ్ 600ఎకరాలు కొట్టేశారు- మైనింగ్ క్వారీల నుంచి భారీగా కమీషన్లు : మూర్తి యాదవ్ - Peethala Murthy Yadav comment - PEETHALA MURTHY YADAV COMMENT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 12:22 PM IST
Janasena Leader Peethala Murthy Yadav comment on Gudivada Amarnath : గత ఐదేళ్లలో అనకాపల్లి జిల్లాలో ఉన్న మైనింగ్ క్వారీల నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భారీగా కమీషన్లు తీసుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. 600 ఎకరాల విస్సన్నపేట భూములను కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు అనకాపల్లి జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోని అమర్నాథ్ సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయికి దిగజారారని మండిపడ్డారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లికి ఏం చేశారో చెప్పాలంటూ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. కనీసం పోలవరం కుడి కాలువ నిర్మించి అనకాపల్లి వాసుల దాహార్తిని కూడా తీర్చలేకపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రూ. 800 కోట్లతో 93 కి.మీ మేర పోలవరం కాలువ నిర్మాణం ద్వారా అనకాపల్లికి నిరంతరం నీళ్లిచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నాట్లు పేర్కొన్నారు. అమర్నాథ్ తన పరిపాలన కనీసం ఒక రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదని ఎద్దేవా చేశారు.