ఏ హామీతో వైఎస్సార్సీపీలో చేరారు- కాపు రిజర్వేషన్ కోసం పోరాడే ధైర్యం ఉందా? : ముద్రగడను నిలదీసిన కిరణ్ రాయల్ - Kiran Royal Fire On Mudragada
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 10:27 PM IST
Janasena Leader Kiran Royal Fire On Mudragada Padmanabham : వైఎస్సార్సీపీలో నెల జీతానికి పని చేస్తున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని, కాపుల కోసం ఏం ఉద్దరించాడో చెప్పగలడా అని జనసేన పార్టీ నాయకులు, ఆ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాపు ఉద్యమం జరిగినప్పుడు అధికార పార్టీ నేతల నుంచే ముద్రగడ పద్మనాభం విరాళాలు తీసుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే ముద్రగడ సొంత పార్టీ పెట్టగలడా అని ప్రశ్నించారు.
కాపు నిధులు ఏమయ్యాయో జగన్ను ప్రశ్నించగలవా? : తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వెంట రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని, ముద్రగడ వెనుక ఒక్క కాపు నాయకుడు కూడా లేరని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్ కోసం పోరాడే ధైర్యం ముద్రగడకు ఉందా అని ప్రశ్నించారు. ఏ హామీతో ముద్రగడ వైఎస్సార్సీపీలో చేరారో ప్రజలకు చెప్పాలని అన్నారు. కాపు నిధులు ఏమయ్యాయో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించగలరా అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ను విమర్శించే హక్కు ముద్రగడకు లేదని ఆయన పెర్కోన్నారు.