'రైల్వే బ్రిడ్జి పూర్తి కాకుండా ఓట్లు అడగనన్నారుగా?! - రవీంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేయాలి' - Former MLA Veera Siva Reddy Fires
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 1:24 PM IST
Former MLA Veera Siva Reddy Fires on Kamalapuram MLA: కమలాపురం రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ధ్వజమెత్తారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండా ప్రజలను ఓట్లు అడగనని చెప్పిన రవీంద్రనాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని శివారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి మేలు చేయకపోగా గ్రామపంచాయతీగా ఉన్న ఊరిని నగర పంచాయతీగా మార్చి ప్రజలపై భారం మోపారని విమర్శించారు.
మేనల్లుడు ముఖ్యమంత్రిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం కమలాపురానికి అభివృద్ధి చేయకుండా అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి అధికారాన్ని వాడుకున్నారని శివారెడ్డి మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని జగన్మెహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే, రవీంద్రనాథ్ రెడ్డికి రెండు ఛాన్సులు ఇచ్చిన కమలాపురానికి చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత చెల్లికి, తల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్ర మహిళలకు ఏం చేస్తాడని అన్నారు.