వైఎస్సార్సీపీ హయాంలో భారీ ఎత్తున భూ కబ్జాలు- 28న భూ బాధితుల సదస్సు : సీపీఐ - CPI LEADER RAMA KRISHNA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 7:43 PM IST

thumbnail
వైఎస్సార్సీపీ హయాంలో భారీ ఎత్తున భూ కబ్జాలు- 28న భూ బాధితుల సదస్సు : సీపీఐ (ETV Bharat)

CPI Leaders Rama Krishna Comment on Land Grabs in AP : రాష్ట్రంలో భారీ ఎత్తున భూ కబ్జాలు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధికారుల సాయంతో వేల ఎకరాలు కబ్జా చేశారని మండిపడ్డారు. వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడానికి సబ్​ కలెక్టర్​ కార్యాలయంలోని ఫైళ్లను దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారని పేర్కొన్నారు. 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి 982 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి బినామీలకు కట్టబెట్టిన అంశం ఓ పత్రికలో వచ్చినట్లు రామకృష్ణ తెలిపారు. అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్​ కలెక్టర్ సహకారంతో భూ బదలాయింపు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆ అధికారి తిరుపతి కలెక్టర్​గా ఉన్నారని పేర్కొన్నారు. అన్యాయం చేసిన వారే అధికారంలో ఉంటే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం జరిగిన భూ కబ్జాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 28న (ఆగస్టు 28న) విజయవాడలో భూ బాధితుల సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.