LIVE : గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల - Congress Gandhi Bhavan live

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 12:03 PM IST

Updated : Apr 25, 2024, 12:27 PM IST

thumbnail
Congress Live :  తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రానికి చేసేంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీస్తున్నారు. దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని, రైతులను కాల్చి చంపినందుకు ఓటు వేయాలా? నల్లధనం వెనక్కి రప్పించి జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారని ఎవరికైనా వేశారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా నేడు హైదరాబాద్‌ గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్డ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.
Last Updated : Apr 25, 2024, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.