రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి: సీఎం చంద్రబాబు - CM CBN Review on Electricity

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 9:12 PM IST

thumbnail
రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి: సీఎం చంద్రబాబు (ETV Bharat)

CM Chandrababu Review on Electricity Department: వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్​ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై సమీక్షించిన సీఎం ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటుచేయాలని నిర్దేశించారు. డిమాండుకు తగ్గ విద్యుత్ ఉత్పత్తి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి, సరఫరా మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ దిశగా ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, యూనిట్ విద్యుత్ తయారీకి అవుతున్న వ్యయం, లోటు భర్తీకి ఇతర గ్రిడ్ల నుంచి కొనుగోలుకు చేస్తున్న వ్యయంపైనా అధికారులతో సమీక్షించారు. థర్మల్, జల విద్యుత్, సోలార్, విండ్ పవర్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు, త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితులపై చర్చించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సందర్భంగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులను సీఎంకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.