ప్లేస్, టైం చెప్తే ఎక్కడికైనా వస్తా, దేనిమీదైనా చర్చిస్తా సిద్ధమా జగన్: చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 12:14 PM IST

thumbnail

Chandrababu Challenge to YS Jagan: బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ది పాలన ఎవరిదో? విధ్వంసం ఎవరిదో? చర్చించేందుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్​ను కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ అని చంద్రబాబు మండిపడ్డారు. 

జగన్‌(Jagan)కు, ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది ఇంకా 50 రోజులేనని స్పష్టం చేశారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్​ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడకి పట్టిన గతే జగన్‌కు పడుతుందని ధ్వజమెత్తారు. అబద్ధపు ప్రసంగాలు కాదు అభివృద్ది పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో, జనం ముందు చర్చిద్దాం దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా అని సవాల్‌ చేశారు. ప్లేస్, టైం నువ్వే చెప్పు ఎక్కడికైనా వస్తా దేనిమీదైనా చర్చిస్తా నువ్వు సిద్ధమా జగన్ అంటూ చంద్రబాబు ఛాలెంజ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.