thumbnail

సూర్య దేవుడి సేవలో అమరావతి రైతులు -అరసవెల్లిలో ప్రత్యేక పూజలు - Capital Farmers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 3:33 PM IST

Capital Farmers Prayers Arasaveli Sun God in Srikakulam District : కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు ప్రారంభం కావడంతో అమరావతి రైతులు సూర్యదేవుడికి మొక్కులు చెల్లించారు. శ్రీకాకుళం జిల్లాలో  కొలువైన అసరవెల్లి సూర్య దేవుడికి తుళ్లూరు, దొండపాడు, అనంతవరం గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్​ చాలీసా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Amaravathi Farmers : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో (జూన్​ 4) కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీ సాధించి, అమరావతి పనులు ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అమరావతి రాజధాని పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సూర్య భగవానుడుని కోరుకున్నట్లు తెలిపారు. రాజధాని కోసం తాము చేసిన త్యాగాలు, పోరాటాలు ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు. రాక్షసపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.