LIVE: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​పై బీఆర్​ఎస్​ నేతలు ఫైర్​ - తెలంగాణ భవన్​లో మీడియా సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 8:04 PM IST

Updated : Mar 15, 2024, 8:12 PM IST

thumbnail

Press Meet at Telangana Bhavan LIVE : కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్టుపై తెలంగాణ భవన్​లో మీడియా సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను భయపెట్టేందుకే కవిత అరెస్ట్ అని మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పిట్ట బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కవితను రాత్రి 8.45 గంటలకు విమానంలో దిల్లీకి తీసుకెళ్తామన్నారని, ప్రణాళిక ప్రకారమే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని, కవిత కోసం విమానం టికెట్‌ బుక్‌ చేసి మరీ సోదాలకు వచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే మహిళ అరెస్టు అంశంపై సుప్రీంలో కేసు నడుస్తోందని, సుప్రీం సూచనలనూ పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. ఈ నెల 19న సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్టు సరికాదన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్​ చేశారు. జూబ్లీహిల్స్​లోని ఆమె నివాసంలో సోదాల అనంతరం ఆమెను అరెస్ట్​ చేస్తున్నట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు. 

Last Updated : Mar 15, 2024, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.