వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బలిజల ఆగ్రహం - 'మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం' - వైఎస్సార్సీపీ బలిజలను నిర్లక్ష్యం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 1:10 PM IST

Balijalu Fires On YSRCP Govt : రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వైఎస్సార్సీపీ నాయకులందరూ బలిజలను నిర్లక్ష్యం చేశారని కడప బలిజ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క బలిజ అభ్యర్థికి కూడా టికెట్ కేటాయించకపోవడం దారుణమని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ ఖండించారు. రాబోయే ఎన్నికల్లో బలిజలు అందరూ ఏకమై జగన్‌ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. E.W.S (Economically Weaker Section)  విధానాన్ని కూడా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలిజ సోదరులు, మేధావులందరూ ఈ ఎన్నికల్లో  మేల్కోవాలని సూచించారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో రెండు ఎమ్మెల్యే సీటు ఇచ్చేవారి కానీ ఇప్పుడు అవి కూడా ఇవ్వడంలేదని, అవీ తమ సామాజిక వర్గాల వారికి ఇచ్చి మైనింగ్​, ఎర్రంచందనం స్మగ్లర్లను, దోపిడీ దారులను తయారు చేస్తున్నారన్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.