పెట్రోల్ పోసి గుడిసెలు దహనం- కర్రలతో రాళ్లతో దాడులు- అంతా ప్రభుత్వ భూమి కోసమేనా! - Fight For Land in YSR District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 11:35 AM IST

thumbnail
పెట్రోల్ పోసి గుడిసెలు దహనం- కర్రలతో రాళ్లతో దాడులు- అంతా ప్రభుత్వ భూమి కోసమేనా! (ETV Bharat)

Fight For Land in YSR District : వైఎస్సార్​ జిల్లా గోపవరం మండలం సిద్ధమ్మపేరంటాల వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. వీరు ప్రభుత్వ స్థలం విషయంలో పరస్పర దాడికి పాల్పడ్డారు. గోపవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కొండగట్టు ఉంది. బద్వేల్‌ మున్సిపాలిటీలోని మిద్దెలవారిపాలేనికి చెందిన కొందరు కొండపై చదును చేసి గుడిసెలు వేశారు. వాటిని శ్రీనివాసపురం గ్రామస్థులు కొందరు పెట్రోల్ పోసి కాల్చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు గుడిసెల వద్దకు వెళ్తుండగా శ్రీనివాసపురం గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో గుడిసెలు ఎందుకు వేశారని వాగ్వాదానికి దిగటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవకు దిగినవారిపై లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అప్పటికే వారు కర్రలు, రాళ్లతో దాడి చేసుకుంటుండడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని కట్టడి చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ వారిలో కొందర్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.