'హర్ ఘర్ తిరంగా' పేరుతో ప్రధాని మోదీ క్యాంపెయిన్ చేస్తున్నారు : వైఎస్ షర్మిల - YS Sharmila Fires on PM Modi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 2:30 PM IST

thumbnail
విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ షర్మిల (ETV Bharat)

YS Sharmila Fires on PM Modi : ఎంతో మంది త్యాగాల ఫలితం వల్లే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల అన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న మహనీయులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే స్థానం సంపాదించుకోవడానికి పునాదులు వేసింది తమ పార్టీనేనని గుర్తు చేశారు. ఎన్నో సంస్కరణల ఫలితంగానే దేశం ఈ స్థాయికి చేరిందన్నారు. విజయవాడ ఆంధ్ర రత్నభవన్​లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.

YS Sharmila Flag Hoisting in Vijayawada :  అంతకుముందు షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె దేశ, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ మోదీ క్యాంపెయిన్ మొదలు పెట్టారని షర్మిల విమర్శించారు. ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసి సెల్ఫీ తీసుకోని అప్​లోడ్ చేస్తే దానికి సర్టిఫికెట్ ఇస్తామని అనడం ఏంటనీ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అరాచకాలను కొనసాగిస్తుందని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.